YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గవర్నర్ తో కాంగ్రెస్ మహిళానేతల భేటీ

గవర్నర్ తో కాంగ్రెస్ మహిళానేతల భేటీ

గవర్నర్ తో కాంగ్రెస్ మహిళానేతల భేటీ
హైదరాబాద్ నవంబర్ 27  
తెలంగాణ గవర్నర్ తమిళసైతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆధ్వర్యంలో మహిళ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇందిరా శోభన్ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణాలో స్వయం ప్రతిపత్తి కల్గిన లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, మహిళ కమిషన్ లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వివరించారు.కొన్నాళ్లుగా చైర్మన్ లను నియమించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఫిర్యాదు చేశారు. అలాగే ఆర్టీసీ అంశాన్ని కూలంకషంగా ఇందిరా శోభన్ గవర్నర్ కు వివరించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.  ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పినట్లు తెలిపారు. ఆర్టీసీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించానని, కార్మికులకు అండగా ఉంటానని ఎవరు అధైర్యపడవద్దని గవర్నర్ చెప్పినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు కాట సుధారాణి, శ్రేదేవి, శైలజ, రమా, రూప, కీర్తి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Related Posts