YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

హైకోర్టును ఆశ్రయించిన  గూడూరు ఎమ్మార్వో హసీనాబీ

హైకోర్టును ఆశ్రయించిన  గూడూరు ఎమ్మార్వో హసీనాబీ

హైకోర్టును ఆశ్రయించిన  గూడూరు ఎమ్మార్వో హసీనాబీ
కర్నూలు, 
కర్నూలు జిల్లా గూడూరు ఎమ్మార్వో హసీనాబీ ఇంకా పరారీలో ఉన్నారు. లంచం వసూలు చేస్తున్న కేసులో ఆమె సోదరుడ్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆమె కనిపించకుండా పోయారు. దాదాపు మూడు వారాలకుపైగా ఆమె ఎక్కడికి వెళ్లారు.. ఎక్కడ ఉన్నారనే అంశం మిస్టరీగానే ఉంది. తాజాగా ఆమెకు సంబంధించి మరో కీలక సమాచారం వచ్చింది. హసీనాబి హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.హసీనాబీకి మరో ఇద్దరు ఎమ్మార్వోలు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. వారి సలహాతోనే ఆమె హైకోర్టును ఆశ్రయించినట్లు చర్చ జరుగుతోంది. నేరుగా లంచం తీసుకొని దొరకలేదు కాబట్టి.. బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటే మంచిదని వారిద్దరు చెప్పడంతో హైకోర్టులో పిటిషన్ వేశారట. ఈ విషయం ఏసీబీ అధికారులకు తెలియడంతో.. ఇద్దరు ఎమ్మార్వోలను పిలిచి ప్రశ్నించినట్లు సమాచారం. ఇటు ఏసీబీ అధికారులు కూడా బెయిల్‌ ఇవ్వొద్దంటూ కౌంటర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.కర్నూలు జిల్లా గూడూరులో షేక్‌ హసీనాబీ ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్నారు. సురేష్ అనే రైతు తన పొలానికి సంబంధించిన సమస్యపై ఎమ్మార్వోను కలవగా.. ఆమె లంచం డిమాండ్ చేశారు. రూ.8 లక్షలు ఇస్తేనే సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. అంత డబ్బు ఇవ్వలేనన్న సురేష్.. రూ.4 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. తర్వాత రైతు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించగా.. ఈ నెల 7న హసీనాబి తన సోదరుడు బాషాను లంచం తీసుకునేందుకు పంపారు. సురేష్ అతడికి లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.బాషా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడని తెలియడంతో హసీనాబీ కనిపించుకుండాపోయారు. తర్వాత ఆమె సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా హసీనాబా సీ.క్యాంప్‌లోని ఓ క్వార్టర్‌లో ఉంటున్నట్టు గుర్తించారు. తాళం వేసి ఉన్న ఓ క్వార్టర్‌లో ఆమె నివాసం ఉంటున్నట్టు తెలిసింది. రెవెన్యూ అధికారుల సమక్షంలో తలుపు పగలగొట్టి చూడగా.. ఓ వ్యక్తితో హసీనాబీ దిగిన ఫొటోలు కనిపించాయి. అతణ్ని కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్యగా గుర్తించారు.గిడ్డయ్యతో హసీనాబీ సహజీవనం చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. హసీనాబీతోపాటు గిడ్డయ్య కూడా పరారీలో ఉన్నాడని తేల్చారు. సోమవారం నుంచి ఆయన మెడికల్ లీవ్ పెట్టారని ఏసీబీ అధికారులు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్‌గా పని చేసే గిడ్డయ్యకు ఏడాది క్రితం ఎంపీడీవో ఉద్యోగం వచ్చిందని ఏసీబీ అధికారులు చెప్పారు. వీరిద్దరూ కలిసి పారిపోయారని.. అనంతపురం జిల్లా శింగనమలలో ఉన్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. ఏసీబీ సిబ్బంది టీమ్ అక్కడికి వెళ్లేలోగానే వారు అక్కడి నుంచి పారిపోయారట. ఆయన కూడా నెలరోజులు మెడికల్‌ లీవ్‌ పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరి కోసం గాలింపు సాగుతోంది.

Related Posts