YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

హిమాలయాల యాత్ర చాలా ప్రశాంతంగా జరిగింది

Highlights

  • పెరియార్ విగ్రహం ధ్వంసం చేయడం అనాగరికం
  • చెన్నైలో విలేకరులతో మాట్లాడిన రజనీకాంత్
హిమాలయాల యాత్ర చాలా ప్రశాంతంగా జరిగింది

హిమాలయాల యాత్ర చాలా ప్రశాంతంగా జరిగిందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు. హిమాలయాల పర్యటన ముగించుకుని మంగళవారం చెన్నై చేరుకున్న అయన మీడియాతో మాట్లాడారు.తనకు ఈ యాత్ర  కొత్త శక్తి నిచ్చిందని అన్నారు. తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి మీడియా ఎన్ని ప్రశ్నలు వేసినా తాను చెప్పే సమాధానమిదేనని అన్నారు. త్వరలో తన రాజకీయ పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే. రజనీ ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ వెనుక బీజేపీ ఉందనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో  తన వెనుక ఉన్నది ‘దేవుడు’ అని రజనీ స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనను ఖండిస్తూ.. ఇటువంటి అనాగరిక సంఘటన జరగకుండా ఉండాల్సిందని అన్నారు.

Related Posts