YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

యువతిపై క్లాస్ మేట్ రేప్, హత్య 

యువతిపై క్లాస్ మేట్ రేప్, హత్య 

యువతిపై క్లాస్ మేట్ రేప్, హత్య 
వరంగల్, 
హన్మకొండలో సంచలనం రేపిన యువతి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. యువతిని తోటి క్లాస్‌మెట్ అత్యాచారయత్నం చేయగా.. తర్వాత యువతి చనిపోవడంతో మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసి వెళ్లినట్లు తేలింది. నిందితుడ్ని సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడ్ని గుర్తించారు. నిందితుడు, కుటుంబ సభ్యులపై యువతి బంధువులు దాడికి ప్రయత్నించారు.దీనదయాళ్ నగర్‌కు చెందిన మల్లయ్య, స్వరూప దంపతులు కుమార్తె మానస. బుధవారం ఆమె పుట్టిన రోజు కావడంతో భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. గుడికి వెళుతున్నానని చెప్పిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. మధ్యాహ్నం వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆమె కోసం పట్టణంలో గాలింపు మొదలుపెట్టారు.బుధవారం రాత్రి 11 గంటల తర్వాత యువతి మృతదేహాన్ని హంటర్ రోడ్డులో గుర్తించారు. కన్నకూతురు మరణంతో షాక్ తిన్న తల్లిదండ్రులు.. కూతురిని ఆ స్థితిలో చూసి భోరున విలపించారు. పుట్టినరోజు నాడే కూతురు ఇలా విగతజీవిగా పడి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయారు. పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్‌ మార్చురీకి తరలించారు.యువతి మరణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలం సమీపంలో సీసీ ఫుటేజ్ పరిశీలించారు. నిందితుడు మానస క్లాస్‌మెట్ సాయిగా గుర్తించి.. కీలక ఆధారాలను సేకరించారు. అతడ్ని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టినరోజు నాడు మానసను నమ్మించి సాయి బయటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారయత్నం చేయగా.. యువతికి తీవ్ర రక్త స్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిందట. తర్వాత యువతి చనిపోవడంతో.. రోడ్డు ప్రక్కనే మృతదేహాన్ని పడేసి పారిపోయాడు. ఈ ఘటన వెనుక సాయి ఒక్కడే ఉన్నాడా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Related Posts