YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఐదుగురు డిప్యూటీలు ఇచ్చాం మరాఠ  పాలిటిక్స్ పై జగన్ కామెంట్స్

ఐదుగురు డిప్యూటీలు ఇచ్చాం మరాఠ  పాలిటిక్స్ పై జగన్ కామెంట్స్

ఐదుగురు డిప్యూటీలు ఇచ్చాం
మరాఠ  పాలిటిక్స్ పై జగన్ కామెంట్స్
విజయవాడ, 
మహారాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జ్యోతిబా పూలే వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఏపీలో తాను తీసుకున్న నిర్ణయానితో పోలుస్తూ మహారాష్ట్రలో పరిస్థితులపై స్పందించారు.
పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పదవి ఒక్కరికే ఇచ్చారని.. అక్కడ రాజకీయాలు అలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మంత్రివర్గంలో ఆయా వర్గాలకు 60 శాతం పదవులు ఇచ్చామని.. ఇక్కడ మాత్రం తాము ఎవరూ ఊహించని విధంగా ఏపీ మంత్రి వర్గంలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టామన్నారు. ఆ పదవుల్లో కూడా బడుగు, వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం కల్పించామన్నారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా తాము భావిస్తున్నామని.. అందుకే అన్ని పదవుల్లో వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకొచ్చారు జగన్.నిరుపేద కుటుంబాల పిల్లలు బాగా బాగా చదువుకోవాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు సీఎం. అన్ని రంగాలలో ఎదగాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీన్ని కూడా రాజకీయం చేస్తూ విమర్శలు చేస్తున్నారని.. ఇంగ్లీష్ మీడియం నిర్ణయం వల్ల సంస్కృతి పోతుందనడం సరికాదన్నారు. ఇంగ్లీష్ మీడియంపై విమర్శలు చేస్తున్న వారి పిల్లలు మాత్రం చక్కగా ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుతున్నారని.. కేవలం పేద పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదివితేనే సంస్కృతి పోతుందా అని ప్రశ్నించారు.చంద్రబాబు పదవి నుంచి దిగిపోతూ వనరులు ఉన్న రాష్ట్రం కాకుండా.. అప్పులు పెట్టి పోయారని వ్యాఖ్యనించారు జగన్. ఎక్కడా నిధులు లేని రాష్ట్రం ఇచ్చారని.. అయినా ఎవరికీ ఏదీ ఎగ్గొట్టకుండా దేవుడు, ప్రజలపై నమ్మకం ఉంచి అడుగులు వేశామన్నారు. దాదాపు 46 లక్షల రైతులకు పెట్టుబడి సహాయం చేశామని, తొలిసారిగా కౌలు రైతులకు ఇచ్చామని వెల్లడించారు. దాదాపు 2.36 లక్షల ఆటోలు, క్యాబ్‌ల డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందరి చల్లని దీవెనలతో ఇవ్వగలిగామని తెలిపారు. ఇంకా మొన్నటికి మొన్న మత్స్యకార సోదరులకు కూడా ఆర్థిక సహాయం చేశామన్నారు.

Related Posts