YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆర్టీసీపై కేబినెట్ లో తీవ్ర చర్చ

ఆర్టీసీపై కేబినెట్ లో తీవ్ర చర్చ

ఆర్టీసీపై కేబినెట్ లో తీవ్ర చర్చ
హైద్రాబాద్, 
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆర్టీసీ సమస్యే ప్రధాన అజెండాగా చర్చలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఆర్టీసీ సమస్యకు ముగింపు ఇచ్చే దిశగా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఆర్టీసీపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మె విరమించిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటారా? లేదా.. కేబినెట్ సమావేశంలో ఆ దిశగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.48 వేల మందికి పైగా కార్మికులు 52 రోజుల పాటు సుదీర్ఘంగా సమ్మె చేశారు. అనేక పరిణామాల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. విధుల్లోకి చేరేందుకు సిద్ధమని చెబుతున్నా.. ఆదేశాలు లేవంటూ అధికారులు అనుమతించడంలేదు. దీంతో డిపోల ఎదుటు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగాల్లో చేర్చుకోవాలంటూ పలువురు కార్మికులు కంటతడి పెడుతున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం శుక్రవారం కూడా కొనసాగే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు జరగనున్న కేబినెట్‌ భేటీలో ప్రధానంగా ఆర్టీసీ ఆంశంపైనే చర్చించనున్నట్లు సమాచారం. దీంతో ఆర్టీసీతో పాటు కార్మికుల భవిష్యత్తుపై సీఎం కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంశంపై తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 5,100 రూట్లలో పర్మిట్లను ప్రైవేటుకు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజా కేబినెట్ సమావేశంలో మరిన్ని రూట్లలో ప్రైవేట్ పర్మిట్లు ఇచ్చే అవకాశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆర్టీసీలో కొత్తగా శాశ్వత నియామకాలను పూర్తిగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related Posts