YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

వివాహిత హత్య కేసు మిస్టరీ విడింది

వివాహిత హత్య కేసు మిస్టరీ విడింది

వివాహిత హత్య కేసు మిస్టరీ విడింది
ఆసిఫాబాద్ :
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలానికి చెందిన టేకు లక్ష్మి అనే వివాహిత , దారుణ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఒంటరి మహిళపై సామూహిక ఆత్యాచారం, తరువాతకిరాతంగా హతమార్చిన ముగ్గురు నరహంతకులు షేక్ బాబు, షేక్ షాబొద్ధిన్, షేక్ మఖ్ధుంలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లపటార్ కు చెందిన  ముగ్గురు నిందితులను మీడియా సమావేశంలో హాజరుపరిచిన జిల్లా ఎస్పీ మల్లారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 25 న రాంనాయక్ తండా ఎల్లపటార్ శివారు ప్రాంతంలోని చెట్ల పొదల్లో ఆత్యాచారం, దారుణ హత్యకు పాల్పడ్డ నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు,పిడి యాక్ట్ నమోదు  చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. గతంలోనూ వీరికి నేరచరిత్ర ఉంది. పంచుల సమక్షంలో నిందితుల నుంచి వాగ్మూలం తీసుకొని హత్యకు వాడిన కత్తిని స్వాధీనం పర్చుకున్నారు. ఇతర సాక్ష్యాదారాలను సేకరించారు. శాస్త్రీయ ఆధారాలు సేకరించి కేసును పకడ్భందిగా పరిశోధన చేస్తాం, భౌతిక సాక్ష్యాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి వేగంగా పరిశోధించి 60 రోజుల్లో చార్జి షీట్ దాఖలు చేస్తామని అన్నారు. ఆరు నెలల్లో కోర్టులో పక్కాగా సాక్ష్యులను ప్రవేశ పెట్టి నిందితులకు శిక్ష పడేలా చుస్తామన్నారు.

Related Posts