YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సర్వభూపాల వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌నుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి

సర్వభూపాల వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌నుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి

సర్వభూపాల వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌నుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి
తిరుపతి 
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌న శ్రీ కృష్ణుని అలంకారంలో  ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ.  సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.స్వర్ణరథంపై మెరిసిన  శ్రీ మహాలక్ష్మిబ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణ రథంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను ఆనుగ్రహిస్తారు. 

Related Posts