Highlights
రాజకీయాలకు, కుట్రలకు వేదికగా రాజ్ భవన్ మారింది
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోని నరసింహన్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని తెలుగు రాష్ట్ర ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేనందునే కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారన్నారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న మోదీ, కేసీఆర్ లకు వ్యతిరేకంగా తాము పోరాడతామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేశారని ఇటీవల జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ ప్రస్తావించారు. ప్రధాని మోదీ అజెండాను అమలు చేసేందుకు రాజ్ భవన్ ను వాడుకుంటున్నారని, అందుకే, పదవీకాలం ముగిసినా ఆయన్ని కొనసాగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.