YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసిఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ సాధ్యమైంది ఎమ్మెల్యే సంజయ్ కుమార్

కేసిఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ సాధ్యమైంది ఎమ్మెల్యే సంజయ్ కుమార్

కేసిఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ సాధ్యమైంది
ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల  నవంబర్ 29 
కేసిఆర్ కరీంనగర్ లో ప్రారంభించిన ఆనాటి దీక్ష ఫలితంగానే నేడు తెలంగాణ సాధ్యమైందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో దీక్ష దివస్ ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ నాడు ప్రాణాలకు తెగించి నేడు పాలకునిగా ఉన్నాడు అన్నారు . సంక్షేమ పథకాలతో కేసిఆర్ ప్రజా రంజక  పాలన కొనసాగిస్తున్నారన్నారు.ఆనంతరం జడ్పీ చైర్మన్ దావ వసంత మాట్లాడుతూ ఆంధ్ర పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పోరాడి సాధించుకున్న తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంటే కాంగ్రెస్ బిజెపి నాయకులకు మింగుడు పడడం లేదన్నారు. తెరాస సీనియర్ జిల్లా నాయకుడు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ 30 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గంలో చేయలేని పనులను కొద్దికాలంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన తెరాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేస్తున్నారని యమ డేంజర్ గా 30 ఏళ్ల నుంచి ప్రజలు యాతనలు పడుతుంటే కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ యవర్ రోడ్డు విస్తీర్ణ పనులను సెంట్రల్ లైటింగ్ తదితర అభివృద్ధి పనులను చేస్తుంటే ప్రజలు ప్రశంసిస్తున్నారు అని కాంగ్రెస్ సీనియర్ నేత మాత్రం అడ్డంకులకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ ఎంపీపీ గంగారం గౌడ్, ఉపాధ్యక్షులు రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ జి ఆర్ దే శాయ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts