YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

చివరి దశకు కార్తీక మహోత్సవాలు తిరుమల

చివరి దశకు కార్తీక మహోత్సవాలు తిరుమల

చివరి దశకు కార్తీక మహోత్సవాలు
తిరుమల, నవంబర్ 30, 
నవంబరు 23 నుంచి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఆదివారంతో ముగియనుండగా, ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించకపోవడం గమనార్హం. ఉత్సవాలు తుది ఘట్టానికి చేరినా ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు ఇంకా సమర్పించకపోవడంతో టీటీడీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో పొన్నాల లక్ష్మయ్య దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నాటి నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. ఏటా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొలి రెండు మూడు రోజుల్లోనే ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి లేదా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి లేదా జిల్లా మంత్రి పట్టువస్త్రాలు సమర్పించేవారు. వీటిని గజవాహనం రోజున అమ్మవారికి అలంకరించేవారు. నవంబరు 23న ప్రారంభమైన కార్తీక బ్రహోత్సవాలు డిసెంబరు 1న చక్రస్నానంతో ముగియనున్నాయి. అయినా, ప్రభుత్వం నుంచి అమ్మవారికి అందే పట్టువస్త్రాల కోసం నిరీక్షణ కొనసాగుతోంది.ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీపద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించారు. క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై చంద్రశైత్య సంభరితములైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శ‌నివారం ఉదయం 7.55 గంటలకు అమ్మవారి రథోత్సవం వైభవంగా జరిగింది. సర్వాలంకార సంశోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళ ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి. శనివారం రాత్రి అశ్వవాహనంపై అమ్మవారు విహరించనున్నారు

Related Posts