తన మతం, కులంపై వస్తున్న ఆరోపణలను చూసి బాధ పడుతున్నాను సీఎం జగన్.
తన మతం, కులంపై వస్తున్న ఆరోపణలపై జగన్ స్పందించారు. గత కొద్ది రోజులుగా తన మతం, కులంపై వస్తున్న ఆరోపణలను చూసి బాధ వేస్తుందోన్నారు. ఎవరెన్నీ అవాకులు, చవాకులు పేలిన.. నా మతం మానవత్వం.. నా కులం మాట నిలబెట్టుకొనే కులం అన్నారు రాష్ట్రంలో పాలనపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మంచి పరిస్థితిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు జగన్. తమ మేనిఫెస్టోనే బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించామన్నారు.