భారతీయ జనతా పార్టీ నేతలు మహారాష్ట్ర ద్రోహులు
ఫడ్నవీస్ రాజీనామాతో 40 వేల కోట్ల రూపాయలు వెనక్కి వెళ్లాయని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ నేతలు మహారాష్ట్ర ద్రోహులని, అందుకే రాష్ట్రానికి కేటాయించిన నిధుల్ని వెనక్కి తీసుకుందని విమర్శలు గుప్పించారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారంతో 40 వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం ఆ నిధుల్ని వెనక్కి తీసుకుంది