YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

.అత్యాచారాలతో తెలంగాణ రాష్ట్రంలో కలకలం

.అత్యాచారాలతో తెలంగాణ రాష్ట్రంలో కలకలం

.అత్యాచారాలతో తెలంగాణ రాష్ట్రంలో కలకలం
వరంగల్, డిసెంబర్ 2:
వరుస అత్యాచారాలతో తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేగుతోంది. ఓ వైపు షాద్‌నగర్‌లో దిశ అత్యాచారం, దారుణహత్య ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతుండగా.. కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు. నాలుగు రోజుల క్రితం హన్మకొండలో 19ఏళ్ల యువతిపై పుట్టినరోజు నాడే ప్రియుడు అత్యాచారం చేసి ప్రాణం తీసిన ఘటన మరువకముందే మరో ఘోరం వెలుగుచూసింది. చికిత్స కోసం తన దగ్గరకు వచ్చిన గిరిజన బాలికను ఓ డాక్టర్ లోబరుచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ములుగు జిల్లాకు చెందిన ఓ గిరిజన బాలిక(14) హన్మకొండలోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది. ఇటీవల ఆమె కళ్లల్లో నీరు కారుతుండటంతో డాక్టర్‌ వద్దకు వెళ్లాలని తోటి విద్యార్థినులు సలహా ఇచ్చారు. దీంతో బాలిక స్థానికంగా ఉండే ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ వద్దకు వెళ్లింది. బాలిక ఒంటరిగా రావడంతో ఆ కీచక డాక్టర్ ఆమెపై కన్నేశాడు. ట్రీట్‌మెంట్ పేరుతో బాలికకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటి తర్వాత మెలకువ వచ్చిన బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకుని రోదించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని డాక్టర్ బెదిరించి ఆమెను పంపేశాడు.నేరుగా హాస్టల్‌కి చేరుకున్న బాలిక తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు హన్మకొండ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ డాక్టర్ పరారయ్యాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

Related Posts