YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ నియంత

కేసీఆర్ నియంత

కేసీఆర్ నియంత
వరంగల్ డిసెంబర్ 2  
ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  సీఎం కేసీఆర్  నేనే రాజు, నేనే మంత్రి , నేనే సర్వస్వం అన్న రీతిలో   వ్యవహరించారని సిపిఐ పార్టి రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి  విమర్శించారు. సోమవారం అయన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని   సీపీఐ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి విజయ్ సారథి అద్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వముగా వ్యవహరిస్తు, 30 మంది ఆర్టీసీ కార్మికుల మరణాలకు కారణమయ్యాడని అన్నారు. యూనియన్ల నాయకుల  మీద ముఖ్యమంత్రి కి ఉన్న కోపం కార్మికుల మీద చూపించారని, యూనియన్లె లేవనడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో పేద ప్రజల పై భారం మోపారన్నారు. వెటర్నరీ డాక్టర్ దిశా హత్య కు కారణమైన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని అయన  డిమాండ్  చేశారు.

Related Posts