YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ దేశీయం

ఢిల్లీలో కేసీఆర్‌కు షాక్... మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం సైలెంట్

ఢిల్లీలో కేసీఆర్‌కు షాక్... మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం సైలెంట్

ఢిల్లీలో పెళ్లికి వచ్చిన మీకు.. దిశా ఇంటికి పరామర్శకు వెళ్లే టైం లేదా ?  కేసీఆర్‌పై నేషనల్ మీడియా 
ప్రధాని, కేంద్రమంత్రులతో కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన వెళ్లారు. అక్కడ అధికారిక కార్యక్రమాలతో పాటు... ఓ నాయకుడి ఇంట పెళ్లికి కూడా హాజరయ్యారు. రెండు రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నారు. అయితే... కేసీఆర్‌పై నేషనల్ మీడియా మండిపడుతోంది. దిశా హత్యాచార ఘటనపై సీఎం స్పందించిన తీరుపై ఇప్పటికే పలు ఆరోపణలు వినిపంచాయి. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ముఖ్యమంత్రి స్పందించాన్ని నేషనల్ మీడియా మండిపడింది. తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌కు ఇదే విషయమై నేషనల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఢిల్లీలో పెళ్లికి వచ్చిన మీకు.. దిశా ఇంటికి పరామర్శకు వెళ్లే టైం లేదా అని ప్రశ్నించారు. దీంతో మీడియా అడిగిన ప్రశ్నలకు ఖంగు తిన్న కేసీఆర్ అక్కడ నుంచ ఏమాట్లాడకుండానే సైలెంట్‌గా వెళ్లిపోయారు

Related Posts