YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబువి నీచ రాజకీయాలు

చంద్రబాబువి నీచ రాజకీయాలు

చంద్రబాబువి నీచ రాజకీయాలు
తిరుమల డిసెంబర్ 03  
తిరుమల శ్రీవారిని ఎపి మంత్రి మోపిదేవి వెంకటరమణ నైవేద్య విరామ సమయంలో సనయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లును చేశారు. దర్శనం ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధానిలో తాత్కాలిక కట్టడాల పేరుతో చంద్రబాబు  ప్రజాధనం వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలో అనేక సంక్షోభ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ఒక్క  ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు.  ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు అక్రమ సంపాదన   లో భాగంగా రాష్ట్రన్ని కొల్లగొట్టి ఆంధ్రప్రదేశ్ ను అధఃపాతాలంలోకి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల కాలంలో అమరావతిలో ఒక్కటంటే ఒక్కటి శాశ్వత కట్టడం కట్టకుండా ఈ రోజు తన ఉనికిని చాటుకోవడం కోసం నీచ రాజకీయాల చేస్తున్నారన్నారు.

Related Posts