జగన్ ది మూర్ఖత్వం
అమరావతి డిసెంబర్ 03,
జగన్ మతం,మానవత్వం కాదు. మూర్ఖత్వం. ఈ 6 నెలల్లో రాష్ట్రానికి మొత్తం రూ.67వేల కోట్లు నష్టం జరిగింది. రాష్ట్రంలో లక్ష బెల్ట్ షాపులు నడుస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. మద్యం షాపుల పక్కనే బెల్ట్ షాప్ లు పెట్టి మద్యం అమ్ముతున్నారు. రాష్ట్ర రెవెన్యూ -17శాతానికి పడిపోయింది. రూ.30వేల కోట్లు ఆదాయం పడిపోయింది. రూ.25వేల కోట్లు అప్పులు తెచ్చారు. మంచి ముఖ్యమంత్రి కాదు ముంచే ముఖ్యమంత్రి అంతానికి ఇవే సాక్ష్యాలని అయన అన్నారు. పోలవరంలో టీడీపీ నిర్ణయాలన్నీ నియమ నిబంధనలు ప్రకారమే అని కేంద్రం స్పష్టం చేసింది. కక్ష వివక్షలే ఈ ప్రభుత్వ ప్రధాన అజెండాలు. సామాన్య మహిళ యలమంచిలి పద్మజ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకున్నారని అయన అడిగారు. మంత్రులకో న్యాయం సాధారణ పౌరులకు మరో న్యాయమా? సామాన్యుల ఆర్ధిక మూలాలు దెబ్బతీసే విధంగా జగన్ వ్యవహారం ఉందని అన్నారు.