YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ఊపిరి. 

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ఊపిరి. 

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ఊపిరి. 
నెల్లూరు డిసెంబర్ 03,  
తెలుగు పార్టీకి కార్యకర్తల ప్రాణమని , నాయకులు , కార్యకర్తలు ఎవరు పార్టీ నుండి వీడిన పార్టీకి నష్టం ఏమీ లేదని జిల్లా మాజీ తెలుగు యువత అధ్యక్షులు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ఆహ్వానితులు మన్నవ రవిచంద్ర తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కావలిలో తెలుగుదేశం పార్టీ ఖాళీ కానీ వస్తున్న వార్తలకు ఉదయం న్యూస్ నెల్లూరు ప్రతినిధి వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గం లో ఖాళీ అవుతున్నట్లు వివిధ పత్రికలలో ఛానల్ లోనూ వస్తున్న వార్తాకథనాలను ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పటి నుండి రాష్ట్రంలో ఏర్పడిన అనేక సంక్షోభాలను ఎదుర్కోవడం జరిగిందన్నారు, అంతేకాకుండా రాష్ట్రంలో ఎదురులేని పార్టీగా ఎదుగుతూ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఎంతో తోడ్పాటు నిచ్చే ఇచ్చిందని  తెలిపారు. కావలి నియోజక వర్గంలో ఇప్పటికిని తెలుగుదేశం ఓటు బ్యాంకు కు ఎటువంటి డోకా లేదని తెలియజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించడం ఎవరి తరం కాదన్నారు. కావలి నియోజకవర్గం పరిధిలోని ఇదే పరిస్థితి ఉందన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలోనూ, మున్సిపాలిటీ ఎన్నికలలోనూ తెలుగుదేశం పార్టీ తన సత్తా చూపుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. టిడిపి నుండి కొంతమంది అవకాశవాదులు పార్టీ నుండి విడిపోయినప్పటికీ ఎటువంటి నష్టం ఏమీ లేదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన బలాన్ని నిరూపించు కునేందుకు సిద్ధంగా ఉందన్నారు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత ఆయా ప్రాంతాలలోని నాయకులు పై ఉందన్నారు.

Related Posts