బీజేపీకి దూరంగా లేను
తిరుపతి డిసెంబర్ 4,
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం తిరుమల దర్శనం తరువాత అయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ కి దూరంగా లేనని, .ప్రత్యేక హోదా అంశంలోనే బీజేపీని విభేధించానని పేర్కొన్నారు. అమిత్ షా అంటే తనకు గౌరవమని అన్నారు. అయితే కానీ వైసీపీ నేతలకు భయమన్నారు. 2014 లో బీజేపీ తో కలిసి పోటీ చేస్తే పరిస్థితి వేరేగా ఉండేదన్నారు. ప్రస్తుతం పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం గా మారాయి.