YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

లక్షెట్టిపేట తెరాస గడప గడప కార్యక్రమం

లక్షెట్టిపేట తెరాస గడప గడప కార్యక్రమం

లక్షెట్టిపేట తెరాస గడప గడప కార్యక్రమం
మంచిర్యాల  డిసెంబర్ 4, 
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో గడప గడపకు టిఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు హాజరయ్యారు,. మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు లో అడ్డంకులు తొలగడంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి నేడు అధికార టీఆర్ఎస్ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఒకటో వార్డు లో గడప గడప తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి అక్కడే ఉండి అధికారులతో మాట్లాడి వాకబు చేశారు ఈ సందర్భంగా ఒకటో వార్డు లో ఉన్నటువంటి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి బుట్టల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు అందులో సౌకర్యాలు మెరుగుపరచాలని బుట్టల తయారీ కూలీలు కోరడంతో వెంటనే స్పందించి లక్ష రూపాయలు కేటాయించి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు తదనంతరం సిసి రోడ్లు ,డ్రైనేజ్ లైన్ లు, త్రాగునీటి వసతి మెరుగుపర్చాలని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులతో చరవాణి లో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని సూచించారు ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులను 15 వార్డులకు 15 వార్డులలో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి లక్షెట్టిపేట ను అభివృద్ధి పథంలో ఉంచుకోవాలని టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిధులు, ఎమ్మెల్యే నిధులు, ఎంపి నిధులు ఇలా అన్నిరకాల నిధులు సమకూరితేనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి అధికార టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వారి వెంట డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస రెడ్డి, టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ ,రాజన్న, కిషన్ ,శ్రీనివాస్ ,షాహిద్, శంకరయ్య, లచ్చన్న ,రమేష్ మరియు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

Related Posts