అమరవీరులకు నివాళులు
విశాఖపట్నం డిసెంబర్ 4,
శతృమూకలను తుదముట్టించడంలో ఆశువులు బాసిన అమరవీరులకు నేవీ అధికారులు శ్రద్దాంజలి ఘటించారు. ఏటా తూర్పు నేవికాదళం నిర్వహించే నేవీ డే రోజున ... కార్గిల్ యుద్దంలో అమురులైన సిబ్బందికి నివాళి అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. విశాఖ ఆర్కేబీచ్ వద్ద అమర వీరులకు చిహ్నంగా స్ధూపాన్ని ఏర్పాటు చేశారు. సైనిక విజయ స్థూపం వద్ద తూర్పు నౌకాదళాధిపతి వైస్ ఎడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ నివాళి అర్పించారు. అనంతరం నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్గిల్లో అమరులైన జవానుల సాహసాలను గుర్తు చేశారు. అనంతరం నావికా సిబ్బంది సంప్రదాయ బద్ధంగా సైనిక వందనాలు చేసి అమరవీరులకు నివాళులర్పించారు. నేవీ అధికారితో పాటు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కూడా అమరవీరులకు అంజలి ఘటించారు.