YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

50 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్,హత్య

50 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్,హత్య

50 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్,హత్య
విజయవాడ డిసెంబర్ 4
;మహిళలకు రక్షణ కల్పిస్తామని, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.  50 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది.తూర్పుగోదావరి జిల్లాలోని జీ.వేమవరంలో 50 ఏళ్ల మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చారు. భర్త కుమారుడు మరణించగా, కుమార్తె హైదరాబాద్లో ఉంటున్న క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది.ముగ్గురు నిందితుల్లో ఒకరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగామరో ఇద్దరి కోసం గాలిసున్నారు. ఈ కేసును సవాల్ గా తీసుకున్న తూర్పు గోదావరి జిల్లా పోలీసులు దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్తున్నారు.

Related Posts