పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ మంత్రి సుచరిత
తిరుపతి డిసెంబర్ 04
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను హోంమంత్రి సుచరిత ఎద్దేవాచేశారు. పవన్ ఏ పార్టీతో ఉన్నారో ఆయనకే తెలియదన్నారు. మత మార్పిడి చేసుకోవడం నేరమా? అని మంత్రి ప్రశ్రించారు. ఇష్ట ప్రకారం మతమార్పిడి చేసుకుంటే తప్పేంటని నిలదీశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే.. వైసీపీ ఎక్కడ ఉండేదని పవన్ వ్యాఖ్యలకు సుచరిత కౌంటరిచ్చారు. 151 సీట్లు ఇచ్చి వైసీపీని ప్రజలు గుర్తించారని, దిశ ఘటనలో నిందితులకు రెండు బెత్తం దెబ్బలు వేస్తే.. సరిపోతుందని జనసేనాని చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. నిందితులకు వేగంగా శిక్ష పడాలన్నదే తమ అభిమతమని సుచరిత చెప్పారు.