YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష  : కేటీఆర్

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష  : కేటీఆర్

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష  : కేటీఆర్
హైద్రాబాద్, డిసెంబర్ 4, 
దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. రాజకీయపరమైన కారణాలతో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడంలేదని విమర్శించారు. బుల్లెట్‌ రైలు వంటి ప్రాజెక్టులను ఢిల్లీ, ముంబయి వంటి నగరాలకే పరిమితం చేశారని.. తెలంగాణ, హైదరాబాద్ గుర్తుకు రావా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో బుధవారం జరిగిన మూడో ఎడిషన్ సీఐఐ డిఫెన్స్ కాన్‌క్లేవ్‌లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. డిఫెన్స్‌ కారిడార్‌ను హైదరాబాద్‌-బెంగళూరు మధ్య కాకుండా మరో చోట ఏర్పాటు చేయడాన్ని కేటీఆర్ తప్పు బట్టారు. రక్షణ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న గుర్తింపును మరిచి, మరో చోట ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పారిశ్రామికీకరణలో కేంద్రం రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు.‘‘టీఎస్‌ ఐపాస్‌ విధానం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక. పారిశ్రామిక సంఘాలు, ఉన్నతాధికారులతో బాగా చర్చించి దీనిని రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. పారిశ్రామిక కాలుష్యం లేకుండా నగరాన్ని మార్చేందుకు ఓఆర్‌ఆర్‌ బయట పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. 2014కు ముందు నాణ్యమైన విద్యుత్తు కోసం ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్తు సమస్యను అధిగమించాం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. కొత్త తరహా ఆలోచనలతో వచ్చే అందరికీ రాయితీలు కల్పిస్తాం. ఎస్సీ, గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ.305 కోట్ల మేర రాయితీలు అందజేశాం. ఈ రాయితీల వల్ల కార్మికులకు ఎంతో మేలు చేకూరుతుంది. పొరుగు దేశం చైనాతో పోటీ పడాలంటే ఎంఎస్‌ఎంఈలతో పాటూ మెగా పార్కులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది.’’ అని ప్రసంగించారు.ఇండస్ట్రియల్ కారిడార్ అంటే కేంద్రానికి ఢిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్‌ (డీఎంఐసీ) గా చెప్తారు. దక్షిణాన రాష్ట్రాలు లేవా? ఇక్కడ నగరాలు లేవా? బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలను పట్టించుకోరా? ఈ మూడు నగరాలను కలుపుతూ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయవచ్చు కదా? దీని వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయి. వేగవంతమైన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కూడా ఢిల్లీ, ముంబయి తప్ప దేశంలో మరెక్కడా ఏర్పాటు చేయరు? ఇలాంటి ప్రవర్తన కేంద్రానికి మంచిది కాదు. ఈ ఆలోచనలు మారాలి’’ అని మంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మరో మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Posts