YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఆయుధాలు లాక్కొని దాడికి ప్రయత్నం తప్పని పరిస్థితిలోనే కాల్పులు

ఆయుధాలు లాక్కొని దాడికి ప్రయత్నం తప్పని పరిస్థితిలోనే కాల్పులు

ఆయుధాలు లాక్కొని దాడికి ప్రయత్నం
తప్పని పరిస్థితిలోనే కాల్పులు
హైద్రాబాద్, డిసెంబర్ 6, 
దిశ నిందితులు పోలీసులపై దాడికి దిగి పారిపోవడానికి ప్రయత్నించడం వల్లే ఎన్‌కౌంటర్ జరిగిందని సీపీ సజ్జనార్ వెల్లడించారు. పోలీసు అధికారుల వద్ద నుంచి ఆయుధాలు లాక్కొని దాడికి దిగారని ఆయన చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను లొంగి పోవాల్సిందిగా పలుమార్లు హెచ్చరించారని.. అయినా ఖాతరు చేయకుండా పోలీసులపై దాడికి దిగి పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారని తెలిపారు. కాసేపటి తర్వాత సంఘటనా స్థలాన్ని పరిశీలించగా నలుగురు నిందితులూ విగత జీవులుగా పడి ఉన్నారని సజ్జనార్ వివరించారు.నిందితుల దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారని.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని సజ్జనార్ తెలిపారు. ఎన్‌కౌంటర్ సందర్భంగా నందిగామ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తలకు తీవ్రమైన గాయమైందని సజ్జనార్ తెలిపారు. కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ కూడా గాయపడ్డారని వెల్లడించారు. శంషాబాద్‌లో దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన వివరాలను సీపీ సజ్జనార్ శుక్రవారం మధ్యాహ్నం మీడియాకు వెల్లడించారు.శుక్రవారం వేకువజామున 5.45 నుంచి 6.15 గంటల మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని సజ్జనార్ చెప్పారు. నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని వివరించారు. ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో ఘటనా స్థలంలో 10 మంది పోలీసు అధికారులు ఉన్నారని తెలిపారు.ఏ1 మహమ్మద్ ఆరిఫ్ ఓ పోలీసు అధికారి వద్ద నుంచి తుపాకీ లాక్కొని దాడికి పాల్పడుతూ ప్రయత్నించాడనీ.. ఆ వెంటనే ఏ4 నిందితుడు చెన్నకేశవులు కూడా మరో తుపాకీ లాక్కొని కాల్పులకు యత్నించాడని సీపీ చెప్పారు. మరో ఇద్దరు నిందితులు రాళ్లతో పోలీసులపై దాడికి ప్రయత్నించారని వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసు అధికారులెవ్వరికీ బుల్లెట్ గాయాలు కాలేదని.. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తలకు మాత్రం తీవ్రమైన గాయమైందని చెప్పారు.నిందితులను డిసెంబర్ 4న పోలీసు కస్టడీలోకి తీసుకున్నామని.. విచారణలో దిశా కేసుకు సంబంధించి వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించామని సజ్జనార్ తెలిపారు. సంఘటనా స్థలంలో బాధితురాలి సెల్ ఫోన్‌ను నిందితులు పాతిపెట్టినట్లు విచారణ సందర్భంగా తెలిపారని.. ఆ సెల్ ఫోన్‌ను రికవరీ చేశామని చెప్పారు.దిశ కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీపీ సజ్జనార్ వెల్లడించారు. నిందితులు కరుడుగట్టిన నేరగాళ్లని.. కర్ణాటక, ఏపీ, తెలంగాణలో మరిన్ని నేరాల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నామని చెప్పారు. తమకు వచ్చిన సమాచారాన్ని పరిశీలించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Related Posts