YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

సెల్యూట్ టూ పోలీస్

సెల్యూట్ టూ పోలీస్

సెల్యూట్ టూ పోలీస్
హైద్రాబాద్, డిసెంబర్ 6, 
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైదరాబాదీ వెటర్నరీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితులు శుక్రవారం ఎన్‌కౌంటర్ అయ్యారు. పోలీసుల తీరును ప్రశంసిస్తూ పలువురు క్రీడాకారులు సోషల్ మీడియాలో స్పందించారు. క్రికెటర్ హర్భజన్ సింగ్, బ్యా్డ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, రెజ్లర్లు బబితా, గీతా ఫొగాట్, యోగేశ్వర్ దత్ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు. గతనెల (నవంబర్)లో వెటర్నరీ డాక్టర్‌ దిశను నలుగురు దుండగులు హత్యాచారం చేసిన సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున ఘటనస్థలికి నిందితులను పోలీసులను తీసుకెళ్లారు. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునేందుకు నిందితులు ప్రయత్నించగా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. అయితే ఈ ఘటనపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌పై క్రీడాకారులు స్పందించారు. టీమిండియా సీనియర్ క్రికెటర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ పోలీసులను ప్రశంసించాడు. ఎన్‌కౌంటర్ చేసినందుకు పోలీసులు, తెలంగాణ సీఎంఓను అభినందించిన భజ్జీ.. భవిష్యత్తులో మరెవరు ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా తగిన బుద్ధి చెప్పారని కొనియాడాడు. హైదరాబాదీ షట్లర్ సైనా పోలీసుల పనితీరుకు సెల్యూట్ తెలిపింది. పోలీసులు చాలా గొప్ప పనిచేశారని, మనంమందరం వారికి సెల్యూట్ చేయాలని ట్వీట్ చేసింది. మరోవైపు గీతా ఫోగాట్ కూడా తెలంగాణ పోలీసులకు ప్రశంసల జల్లు కురిపించింది. మరోవైపు తెలంగాణ పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌తో దేశవ్యాప్తంగా పులకించిపోయిందని గీతా ఫోగాట్ ట్వీట్ చేసింది. దేశ మహిళల్లో శుక్రవారం గుణాత్మక మార్పుతో కూడిన రోజు ఉదయించిందని పేర్కొంది. మరోవైపు శుక్రవారం ఉదయం చాలా సంతోషకరమైన వార్త విన్నానని యోగేశ్వర్ ట్వీట్ చేశాడు. పోలీసుల తీరుపై ప్రశంసలు కురిపించాడు.మరోవైపు హైదరాబాద్ శివార్లలో చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌పై సోషల్ మీడియాలో ఆనందంవ్యక్తమవుతోంది. బాధితులకు సత్వర న్యాయం చేకూరిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Posts