పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు
అమరావతి డిసెంబర్ 6,
గుంటూరు జిల్లా , మంగళగిరి సమీపంలోని శుక్రవారం ఉదయం టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయాన్ని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భవనేశ్వరి ప్రారంభించారు. చంద్రబాబు మాట్లాడుతూ మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయాన్ని టీడీపీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది. మూడు బ్లాక్ల నిర్మాణంలో అందుబాటులోకి మొదటి బ్లాక్ నిర్మాణం చివరి దశలో ఉంది. 75వేల అడుగులతో జీప్లస్-3గా మొదటి బ్లాక్ నిర్మాణం ఉందని అన్నారు. ఈ కార్యాలయంలో మూడో అంతస్తులో చంద్రబాబు, లోకేష్ ఛాంబర్స్ని ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా రాష్ట్ర అధ్యక్షుడి ఛాంబర్ రూమ్లు కేటాయించారు. ఇరురాష్ట్రాల అధ్యక్షులకు అదే విధంగా జిల్లాల అధ్యక్షులకు మంత్రులు, క్యాబీన్ ళ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారము ముందు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.