జగన్ ప్రభుత్వం విధ్వంసాల ప్రభుత్వం
విజయవాడ డిసెంబర్ 7
విజయవాడ రెండవ డివిజన్ లో పిసి రోడ్డు పనులకు కు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శనివారం శంకుస్థాపన చేసారు. ఎంపీ జగన్ ప్రభుత్వం విధ్వంసాల ప్రభుత్వం. అభివృద్ధి చేతకాక పోతే చెప్పండి మేము చేసి చూపుతాం. బెంజ్ సర్కిల్ పై వంతెన మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసాము. రెండవ దశ పనులకు వైసీపీ సర్కార్ మోకాలడుతుందని ఆరోపించారు. జగన్ నిన్న ఏ పని మీద ఢిల్లీ వెళ్లారు? రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్ళారా? మీ పనులు కోసం చీకట్లో అమిత్ షా కాళ్ళు పట్టుకునేందుకు వెళ్ళారా అని ప్రశ్నించారు. తన సొంత పనుల కోసం ప్రభుత్వ డబ్బును దుబారా చేస్తూన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా అభివృద్ధి, సంక్షేమన్ని అమలు చేస్తుంది. మమ్మల్ని నమ్ముకున్న విజయవాడ ప్రజల కోసం వైసీపీ అడ్డుపడిన అభివృద్ధి చేసి తీరుతామని అన్నారు.