ఫ్లాగ్ డే వేడుకలు
విజయవాడ డిసెంబర్ 7
విజయవాడలో సాయుధ దళాల పతాక దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. సాయుధ దళాల నిధి సేకరణకు ఎన్సీసీ విద్యార్ధులు విరాళాలు సేకరించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 7వ తేదీ సాయుధ దళాల పతాక దినోత్సవం ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ వస్తుంది. సాయుధ దళాల పతాక నిధికి ప్రతి ఒక్కరు సహకరించాలి. దేశం కోసం ప్రాణాలు ఓడ్డీ పోరాడుతున్న సైనికులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి. ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ఈ నిధి అందజేయబడుతుంది. ప్రతి విద్యా సంస్థ విద్యార్థుల్లో అవగాహన కల్పించి దేశభక్తిని పెంపొందించే విధంగా సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని గుర్తు చేస్తూ నిధి సేకరించాలని కోరుతున్నానని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నిజమైన నివాళి అంటే వారి కుటుంబాలను ఆదుకోవడమేనని కలెక్టర్ అన్నారు.