చట్ట సభల్లో ఆంగ్లో ఇండియన్స్కు తక్షణమే రిజర్వేషన్స్ తొలగించాలి
ప్రధానికి రేవంత్రెడ్డి లేఖ
న్యూఢిల్లీ డిసెంబర్ 7
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి లేఖ రాశారు. చట్ట సభల్లో ఆంగ్లో ఇండియన్స్కు తక్షణమే రిజర్వేషన్స్ తొలగించాలన్నారు. ఆంగ్లో ఇండియన్స్ స్థానంలో థర్డ్ జెండర్స్కు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఆంగ్లో ఇండియన్స్ కోటాను థర్డ్ జెండర్స్కు దక్కేలా సవరణ చేయాలని కోరారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే ఆర్టికల్ 334(బి) సవరించాలని విజ్ఞప్తి చేస్తూ రేవంత్రెడ్డి లేఖ రాశారు.