YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

అయోధ్య పై ఐదు రివ్యూ పిటీషన్లు

అయోధ్య పై ఐదు రివ్యూ పిటీషన్లు

అయోధ్య పై ఐదు రివ్యూ పిటీషన్లు
లక్నో, డిసెంబర్ 8,
అయోధ్యలో భూ వివాదంపై నవంబరు 9న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తాజాగా మరో నాలుగు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) తరఫున వేర్వేరుగా నలుగురు శుక్రవారం ఈ ఆరు పిటిషన్లు వేశారు. మౌలానా ముఫ్తీ హజ్‌బుల్లా, మహ్మద్‌ ఉమర్‌, మౌలానా మఫ్‌జూర్‌ రెహ్మన్‌, మిష్బాహుద్దీన్‌లు తాజాగా నాలుగు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీరు గతంలో పిటిషన్‌ దాఖలు చేసినవారే.1992 నాటికి తమ స్వాధీనంలో ఉన్న స్థలం హిందువులకు చెందుతుందన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో ప్రస్తుతం ఉనికిలో ఉన్న బాబ్రీ మసీదు పూర్తిగా నాశమవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. డిసెంబరు 6, 1992న మసీదు ధ్వంసం కాలేదని, ఈ తీర్పుతో బాబ్రీని పూర్తిగా నాశనం చేయమని ఆదేశించినట్టయ్యిందని వివరించారు. అంతేకాదు, దేశంలో అశాంతి కలిగించాలని తాము కోరుకోవడంలేదు కానీ, ఏదైనా న్యాయం శాంతికి అనుకూలంగా ఉండాలని కోరారు.సీనియర్ లాయర్లు రాజీవ్ ధావన్, జఫ్రియాబ్ జిలానీలు ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున పిటిషన్లు దాఖలు చేశారు. ముస్లింలు ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటున్నారు.. కానీ, హింసాత్మక ఘటనల్లో ముస్లింలు, వారు ఆస్తులు అన్యాయానికి గురై బాధితులుగా మారుతున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, తీర్పుపై రివ్యూ న్యాయం కోసం అన్వేషణలో భాగమేనని అన్నారు. తీర్పులో న్యాయం లేకుండా శాంతిని పొందలేమని, న్యాయం జరగకుండా శాంతి ఉండదని వివరించారు.ఇదిలా ఉండగా, శుక్రవారం నాటికి బాబ్రీ మసీదును కూల్చి 27 ఏళ్లు పూర్తయ్యాయి. అయోధ్యలో శుక్రవారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేశాయి. మసీదుల్లో ప్రార్థనలు, ఆలయాల్లో పూజలు ప్రశాంతంగా జరిగాయి. యూపీ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పురస్కరించుకుని ముస్లిం సంస్థలు ఏటా డిసెంబర్‌ 6వ తేదీని బ్లాక్‌ డేగా వ్యవహరిస్తుండగా, హిందువులు శౌర్యదినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే.అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు నవంబరు 9న వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ తొలి రివ్యూ పిటిషన్ సోమవారం దాఖలు చేసిన విషయం తెలిసిందే. జమియత్ ఉలేమా ఏ హింద్ సంస్థ 217 పేజీల రివ్యూ పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానంలో ఫైల్ చేసింది. బాబ్రీ మసీదు ఉన్న స్థలాన్ని రామజన్మ భూమిగా గుర్తిస్తూ అక్కడ రామాలయ నిర్మించాలని సుప్రీం ఇచ్చిన తీర్పులో లోపాలున్నాయని ఈ సంస్థ పేర్కొంది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమి హిందువులకే చెందుతుందని నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

Related Posts