YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ గూటికి బీద మస్తాన్ రావు

వైసీపీ గూటికి బీద మస్తాన్ రావు

వైసీపీ గూటికి బీద మస్తాన్ రావు
నెల్లూరు, డిసెంబర్ 7,
ఏపీలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత బీద మస్తాన్‌రావు వైఎస్సార్‌సీపీలో చేరారు. శనివారం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటూ ముఖ్యమైన అనుచరులు, కార్యకర్తలు కూడా వైఎస్సార్‌సీపీగూటికి చేరారు. పార్టీలో చేరిసన నేతల్ని వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు బీద మస్తాన్‌రావు జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు మస్తాన్‌రావు తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేయడానికే తాను పార్టీ మారినట్లు చెబుతున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేశానని.. రాజకీయపరమైన విమర్శలు తప్ప.. తాను ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించ లేదన్నారుబీద మస్తాన్‌రావు ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొద్దిరోజులుగా పార్టీ మారతారని ప్రచారం జరగ్గా.. లేదని ఆయనే ఖండించారు. కానీ శుక్రవారం తన రాజీనామా లేఖను అధినేత చంద్రబాబుకు పంపించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని.. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు లేఖలో ప్రస్తావించారు.బీద మస్తాన్ రావు 2009లో నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో కావలి నుంచి పోటీ చేసి.. వైఎస్సార్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి చేతిలో ఓడారు. సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. కావలి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న ఆయన టీడీపీని వీడటంతో ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది.
ఇదిలా ఉంటే బీద మస్తాన్‌రావు సోదరుడు బీద రవిచంద్రయాద్ మాత్రం టీడీపీలో కొనసాగుతున్నారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.. టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఆయన మాత్రం వైఎస్సార్‌సీపీలో చేరేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు.

Related Posts