YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు

తెలంగాణలో మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు

తెలంగాణలో మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు
వరంగల్
తెలంగాణలో మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్ కేసు వరంగల్‌లో నమోదైంది. సుబేదారి స్టేషన్ పోలీసులు కేసును ఫైల్ చేశారు. 24ఏళ్ల యువతి మిస్సింగ్‌పై సుబేదారి పీఎస్‌లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శాయంపేట పరిధి గోవిందాపూర్‌కు చెందిన యువతి అదృశ్యంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యువతి చిన్నాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన స్టేషన్ పోలీసులను వరంగల్ సీపీ రవీందర్ అభినందించారు. హన్మకొండ పట్టణంలోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌ను జీరో ఎఫ్‌ఐఆర్ పీఎస్‌గా ఎంపిక చేశామని వరంగల్ సీపీ రవీందర్ ఇవాళ ఉదయం ప్రకటించారు. బాధితులెవరైనా సుబేదారి పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

Related Posts