YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

కామారెడ్డిలో ప్రమాదం, ఐదుగురు మృతి

కామారెడ్డిలో ప్రమాదం, ఐదుగురు మృతి

కామారెడ్డిలో ప్రమాదం, ఐదుగురు మృతి
నిజామాబాద్, డిసెంబర్9ఁ
కామారెడ్డి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన కారు ఓ చెట్టును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ సహా నలుగురు మృతి చెందారు. మృతులను నిజామాబాద్‌ జిల్లా నవీపేట వాసులుగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు కారులో వస్తుండగా జంగపల్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.చెట్టును కారు బలంగా ఢీకొట్టడంతో మృతదేహాలు అందులో చిక్కుకున్నాయి. దీంతో పోలీసులు అతికష్టమ్మీద వాటిని బయటకు తీయాల్సి వచ్చింది. స్థానికులు, గ్యాస్‌ కట్టర్‌ సాయంతో కారు భాగాలను తొలగించి మృత దేహాలను బయటకు తీశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృత దేహాలను పోస్ట్‌మార్టం కోసం కామారెడ్డి హాస్పిటల్‌కు తరలించారు.కాగా, బిక్కనూరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలోనూ ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో పలువురు మృత్యువాతపడ్డారు. గత జూన్ 27న అడ్లూర్ ఎల్లారెడ్డి వద్ద కారును లారీ వెనుక నుంచి ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Related Posts