YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

మంటల్లో మరో భవంతి...

మంటల్లో మరో భవంతి...

మహారాష్ట్రలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. థానేలోని గిరిజా హైట్స్ బిల్డింగ్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఎగసిపడటంతో అగ్నిమాపక శకటాలు హుటాహుటిన రంగంలోకి దిగి మంటలను అదుపుచేశాయి. ఇవాళ ఉదయం ముంబై లోయర్ పరేల్ ‌లోని నవ్‌రంగ్ స్టూడియోలోనూ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలను ఆర్పుతుండగా అగ్నిమాపక సిబ్బంది ఒకరు గాయపడ్డారు. 12 అగ్నిమాపక శకటాలు రంగంలోగి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. గత ఏడాది చివర్లో డిసెంబర్ 29న జరిగిన కమలా మిల్స్ కౌంపౌండ్ అగ్నిప్రమాదంలో 14 మంది మంటలకు ఆహుతికాగా, 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ తర్వాత కూడా వరుస అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Related Posts