బస్సు చార్జీలపై విపక్షాల అందోళన
విశాఖపట్నం డిసెంబర్ 09
ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు నిర్ణయనికి వ్యతిరేకంగా విశాఖలో బీజేపీ, వామపక్ష నేతలు నిరసనకు దిగారు. మద్దిలపాలెం బస్ డిపో ముందు నిరసన వ్యక్తం చేసి, ప్రజలపై భారాన్ని మోపే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు,వామపక్ష నగర నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలపై భారాన్ని మోపద్దంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడి పోతున్న ప్రజలకు ఆర్టీసీ బస్ చార్జీల భారాన్ని వెయవద్దని ప్రభుత్వానికి కోరారు.