YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మహిళలపై అత్యాచారాలు చేస్తే..మూడు వారాల్లో శిక్ష

మహిళలపై అత్యాచారాలు చేస్తే..మూడు వారాల్లో శిక్ష

మహిళలపై అత్యాచారాలు చేస్తే..మూడు వారాల్లో శిక్ష
విజయవాడ, డిసెంబర్ 9, 
మహిళలపై అఘాయిత్యాలు ఆగాలంటే చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. మహిళ భద్రతకు సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని.. మహిళకు సంబంధించిన కేసుల్లో కఠిన శిక్షలు పడే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని.. బుధవారం అసెంబ్లీలో కీలకమైన చట్టాన్ని తీసుకురాబోతున్నామని తెలిపారు.దిశ ఘటనలో సమాజం అంతా సిగ్గుతో తలదించుకోవాలి అన్నారు జగన్. ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధను చూస్తే.. నిందితుల్ని కాల్చేసినా తప్పులేదని అందరూ అనుకుంటున్నారన్నారు. తనకు ఇద్దరు ఆడపిల్లలు, చెల్లి, భార్య ఉన్నారని.. వాళ్లకు ఎవరికైనా ఇలా జరిగితే.. ఓ తండ్రిగా ఎలా స్పందించాలి.. వాళ్లకు ఏ రకమైన శిక్ష పడుతుందని తాను ఆలోచన చేయాలి అన్నారు.దిశ ఘటనను మీడియా బాగా ఫోకస్ చేసిందని.. ఈ విషయంలో ప్రభుత్వానికి, కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నాను అన్నారు ఏపీ సీఎం. ‘దిశ కేసుల నిందితుల ఎన్‌కౌంటర్ జరిగింది.. అదే సినిమాలో జరిగితే చప్పట్లు కొడతాం.. ఇదే నిజ జీవితంలో దమ్ము ఉన్నవాళ్లు చేస్తే.. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పేరుతో ఢిల్లి నుంచి వచ్చారు.. ఇలా ఎందుకు చేశారని అడుగుతున్నారు.. ఇంత దారుణమైన చట్టాలు ఉన్నాయి’ అన్నారు జగన్.దేశం, రాష్ట్రంలో చట్టాలు మారాలి.. తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి అన్నారు జగన్. కన్‌క్లూజన్ ఎవిడెన్స్ (ఆధారాల)తో ఉంటే అటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలనేది ఆలోచన చేయాలి అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. కన్‌క్లూజన్ ఎవిడెన్స్ ఉంటే కొన్ని దేశాల్లో షూ ఎట్ సైట్ చేస్తారని గుర్తు చేశారు. ఆ విధంగా ఇక్కడా చట్టాలను సవరించాలని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి. వారం రోజుల లోపు విచారణ పూర్తి చేయాలి.. రిపోర్టులు, నివేదికలు రావాలి రెండు వారాలలోపు ట్రైల్ పూర్తి చేసి.. మూడు వారాల్లోగా ఉరి శిక్ష పడే పరిస్థితి ఉంటే తప్ప ప్రజలకు సంతృప్తి ఉండదన్నారు.ఏదైనా వేగంగా దర్యాప్తు జరగాలి.. కఠినమైన శిక్ష పడుతుందనే భయం రావాలి అన్నారు సీఎం. ఈ దిశగా అడుగులు వేస్తున్నామని.. ఆడవాళ్ల కోసం.. ఇలాంటి కేసుల కోసం ప్రతి జిల్లా ఓ డెడికేటెడ్ కోర్టు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. ఇక సోషల్ మీడియాను చూస్తే భయంగా ఉంటుందన్నారు జగన్.. వేరే వ్యక్తులపై బురుద జల్లేందుకు నీచంగా ప్రవర్తిస్తున్నారన్నారు.సోషల్ మీడియాలో ఆడవాళ్లపట్ల ఎవరైనా నెగిటివ్ పోస్టింగ్ పెడితే శిక్ష పడుతుందనే భయం ఉంటేనే ఇవి ఆగిపోతాయన్నారు జగన్. ఆ దిశగా చట్టాల్లో మార్పులు తీసుకొస్తామని.. సెక్షన్ 354 (ఈ) అమలు చేసే ఆలోచనలో ఉంది అన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్ కూడా అమలు చేస్తున్నామని.. సార్ట్మ్ ఫోన్లు, పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లపై బ్యాన్ ఉన్నా కూడా ఇప్పటికీ కట్టడి చేయలేని పరిస్థితి ఉందన్నారు. సైట్లను బ్యాన్ చేసినా కనిపిస్తున్నాయని.. ఇవన్నీ మార్పు జరగాలి.. బుధవారం మరో విప్లవాత్మక బిల్లు తీసుకొస్తామని చెప్పారు.

Related Posts