YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ దేశీయం

 దిశా ఎన్ కౌంటర్ పై సుప్రీంలో బుధవారం విచారణ

 దిశా ఎన్ కౌంటర్ పై సుప్రీంలో బుధవారం విచారణ

 దిశా ఎన్ కౌంటర్ పై సుప్రీంలో బుధవారం విచారణ
న్యూఢిల్లీ, డిసెంబర్ 9,
షాద్‌నగర్‌లో దిశ అత్యాచారం, హత్య ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం (డిసెంబర్ 11) విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. దిశ హత్య కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని పిటిషనర్లు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ కోరారు.‘పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన 16 మార్గదర్శకాలను అమలు చేయాల్సిందిగా ఆదేశించాలని పిటిషనర్లు అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌‌ను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందంతో విచారణ జరిపించాలని కోరారు.షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం (డిసెంబర్ 9) విచారణ చేపట్టింది. దిశ కేసు నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని.. డీకంపోజ్ కాకుండా తరలింపు కోసం ఎయిర్ కండీషన్డ్ అంబులెన్స్‌ వినియోగించాలని సూచించింది. ఎన్‌కౌంటర్‌పై ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని ఏజీ (అడ్వొకెట్ జనరల్)ని ఆదేశించింది.ఈ ఘటనలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ పాటిస్తే దానికి ఆధారాలు చూపాలని అడ్వొకెట్ జనరల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Related Posts