YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

320 కోట్లు దుర్వినియోగం చేసారు

320 కోట్లు దుర్వినియోగం చేసారు

320 కోట్లు దుర్వినియోగం చేసారు
అమరావతి డిసెంబర్ 10  
అమరావతి నిర్మాణంపై పట్టణాభివృద్ధి, పురపాలకశాఖమంత్రి  బొత్స సత్యన్నారాయణ మంగళవారం శాసనసభలో సమాధానం ఇచ్చారు. గౌరవ సభ్యుడు అమరావతి రాజధాని నిర్మాణానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షరతులు విధిస్తూ ప్రభుత్వానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన మాట వాస్తవమేనా  అని అడిగారు. అడిగిన దానికి సమాధానంగా, అమరావతికి 30వేల ఎకరాలు ఇచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి ఘనకార్యం చేశారు. గజిట్లో ఆ పేరు లేదు. మా ముగ్గురు ఎంపీలే చేశారు. గజిట్లో పేరు లేనప్పుడు ముగ్గురు ఎంపీలే చేశారన్నప్పుడు ఆనాడు  మెజారిటీ ఎంపీలున్నారు కదా, ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రే ఉన్నారు కదా, ఆయనకు ఆ విధానం తెలియదా, ఆ ఆలోచన లేదా అవసరం లేదనుకున్నారా ఆ విషయం తెలియాలి కదా అధ్యక్షా అని అన్నారు. మీరడిన ప్రశ్నేంటి, మాట్లాడుతున్నదేంటి ఎక్కడైనా లింకు ఉందా ఆలోచించుకోవాలి(ప్రతిపక్షసభ్యుడ్ని ఉద్ధేశించి) అధ్యక్షా.. సమయం ఇచ్చారు కదా అని ఏదో ఒకటి మాట్లాడితే ఎలా అధ్యక్షా ..అడగండి ఇంకో ప్రశ్న.. రాజధాని గురించి మాట్లాడుతున్నప్పుడు రాజధాని ఉంటాదా ఉండదా, దీనికి అనుమతి ఉందా లేదా అని అడగండి డైరెక్టుగా తప్పులేదు దానికి సమాధానం చెప్తామని అన్నారు. ఇంకోమాట అన్నారు అధ్యక్షా, నేను శ్మశానం అన్నానన్నారు అధ్యక్షా. నేనేమన్నాను అధ్యక్షా ఆ రోజు, ఇవాళ సభ గురించి, సభ సాక్షిగా చెప్తున్నాను. ఆ రోజు ఏం చెప్పాను. చంద్రబాబునాయు  రాజధాని పర్యటనకు వెళ్తారంట గదా అని ఓ విలేకరి అడిగాడు. ఏం వెళ్తాడయ్యా పచ్చని పొలాలు, సంవత్సరానికి మూడు పంటలు పండేవి, ఈ పరిస్ధితులు అన్నీ తెలిసి అక్కడ ఇప్పుడు చూస్తే శ్మశానవాటికలా తయారు చేశారని అన్నారు. ఇచ్చిన లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చిన పెట్టుబడులు అని చెప్పారు. ఆయన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, సుమారు ఐదువేల కోట్ల రూపాయలు కూడా ఖర్చుపెట్టలేదు. 840 కోట్లు రూపాయలు కన్సెల్టెంట్లకు కోసం ఎంఓయూలు చేశారు. 320 కోట్లు ప్రజాధనాన్ని  దుర్వినియోగం చేశారు. వంద అడుగులులోతుకు పునాది తీయవలిసిన పరిస్ధితులు ఉన్నాయి.  ఈ రకమైన పరిస్ధితులున్నాయి అన్నాను అధ్యక్షాఅని మంత్రి అన్నారు. ఈ పరిస్ధితులును ఏం చూస్తాడయ్యా అని అన్నాను అధ్యక్షా... దాన్ని ఓ పత్రికలో వేశారు. రాయించింది వీళ్లే అధ్యక్షా, వీళ్లే మాట్లాడుతారు. ఇవాళోచ్చి గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి పర్మిషన్ ఇచ్చిందా అని అడుగుతారు అధ్యక్షా.   గ్రీన్ ట్రిబ్యునల్కు దీనికి సంబంధం లేదు,  పర్మిషన్ ఇచ్చింది స్టేట్ ఎన్విరాన్మెంట్  ఇంఫాక్ట్ ఎసెస్మెంట్ అధారిటీ (ఎస్ సి ఐ ఏ ఏ)  ద్వారా పర్మిషన్ ఇస్తారు అని చెప్పాను. సభ్యుడు అవన్నీ వదిలేసి ఏవేవో అడిగారు.  కాబట్టి ఏదైతే అమరావతి నగరం ఉందో, ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చారో వాటిన్నంటికి ప్రభుత్వుం చిత్తశుద్ధితో ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారు కూడా చెప్పారు.  అవన్నీ డెవలప్ చేసి ఇవ్వాలనే  నిర్ణయంతో ఉన్నాం. త్వరలోనే వారందిరికీ  డెవలప్ చేసి ప్లాట్లన్నీ ఇస్తామని తమరి ద్వారా చెపుతున్నానని బోత్స అన్నారు. 

Related Posts