YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో పర్యటించిన నీతి ఆయోగ్ సభ్యులు

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో పర్యటించిన నీతి ఆయోగ్ సభ్యులు

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో పర్యటించిన నీతి ఆయోగ్ సభ్యులు
హైదరాబాద్ డిసెంబర్ 10 
గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామ నరసింహ గౌడ్ మరియు కమిటీ సభ్యులతో కలిసి కొత్తపేట పండ్ల   మార్కెట్ లో నీతి ఆయోగ్ సభ్యులు పర్యటించి రైతులకు అందుతున్న సేవలు , గిట్టుబాటు ధరల గురించి నేరుగా వారి వద్ద నుండి అడిగి తెలుసుకోవడం జరిగింది.రైతులకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ అని , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్నారని , రైతులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వివిధ మార్గాలను అన్వేషించడం జరుగుతుందని , రైతులకు అన్ని రకాలుగా ఆదుకునే విధంగా , వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర , త్రాగునీరు , కనీస సౌకర్యాలు కల్పించడం మొదలగు అన్నిరకాల సౌకర్యాలు కల్పించే దిశగా ఫైలెట్ ప్రాజెక్టు గా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను ప్రకటించేందుకు ఈరోజు నీతి ఆయోగ్ సభ్యులు రావడం జరిగిందని మార్కెట్ కమిటీ చైర్మన్ రామ నరసింహ గౌడ్ తెలిపారు.

Related Posts