YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

రేప్ ఇండియా గా మారుతోంది : కాంగ్రెస్ 

రేప్ ఇండియా గా మారుతోంది : కాంగ్రెస్ 

రేప్ ఇండియా గా మారుతోంది : కాంగ్రెస్ 
న్యూఢిల్లీ, డిసెంబర్ 10, 
లోక్‌స‌భ‌లో ఇవాళ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రీ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్న అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై ఆయ‌న స్పందించారు. ప్ర‌తి అంశంపై మాట్లాడే ప్ర‌ధాని మోదీ, దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌హిళ‌ల భ‌ద్ర‌త అంశంపై మాట్లాడ‌డం లేద‌న్నారు. మేక్ ఇన్ ఇండియా నుంచి భార‌త్‌.. రేప్ ఇన్ ఇండియాగా మారుతోంద‌ని అధిర్ విమ‌ర్శించారు. అంత‌క‌ముందు క‌శ్మీర్ అంశంపై అధిర్‌, షా మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. క‌శ్మీర్‌లో సాధార‌ణ ప‌రిస్థితి నెల‌కొన్న‌దా అన్న అంశంపై ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు మాట‌లు సంధించుకున్నారు. క‌శ్మీర్ లోయ సంపూర్ణంగా సాధార‌ణంగా ఉంద‌ని షా తెలిపారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత క‌శ్మీర్‌లో ర‌క్త‌పాతం జ‌రుగుతుంద‌ని కాంగ్రెస్ భావించింది, కానీ అక్క‌డ ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ద‌ని మంత్రి తెలిపారు. ఒక్క బుల్లెట్‌ను కూడా ఫైర్ చేయ‌లేద‌న్నారు. క‌శ్మీర్‌లో 99.5 శాతం విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌వుతున్న‌ట్లు మంత్రి తెలిపారు. కానీ అధిర్‌కు ఇది సాధార‌ణ ప‌రిస్థితిగా క‌నిపించ‌డంలేద‌న్నారు. ప్ర‌భుత్వం ఎప్పుడైనా నేత‌ల‌ను రిలీజ్ చేస్తుంద‌ని షా తెలిపారు. ఫారూక్ అబ్దుల్లా తండ్రిని కాంగ్రెస్ పార్టీనే 11 ఏళ్ల పాటు నిర్బంధించింద‌న్నారు

Related Posts