అజ్ఞాతం వార్తలు ఆవాస్తవం
కడప డిసెంబర్ 11, (
వైఎస్ వివేకా హత్య కేసులో ఈ నెల 6నే విచారణకు హాజరుకావాలని జమ్మలమడుగు డీఎస్పీ ఫోన్ ద్వారా కోరినట్లు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. కడప జిల్లాలో మీడియా తో మాట్లాడుతూ విచారణకు హాజరైన వారికి 61ఏ కింద నోటీసులు ఇస్తే తనకు మాత్రం 161 సీఆర్సీ కింద నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. నేను అజ్ఞాతంలో ఉన్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని,వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో నేను విజయవాడలో ఉన్నానని చెప్పారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకమ్మని సిట్ కోరిందని చెప్పారు.టీడీపీ హయాంలో సిట్ వద్దు సీబీఐ కావాలని అడిగిన వారు నేడు సిట్ కావాలని అడగటం వెనుక ఆంతర్యం ఏమిటని సిట్ పైన ఎవరికీ అవగాహన లేదని వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.