YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసేందుకు సుపారీ ప్లాన్

ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసేందుకు సుపారీ ప్లాన్

ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసేందుకు సుపారీ ప్లాన్
నల్గోండ డిసెంబర్ 11 
భర్తను అడ్డు తొలిగించుకోవాలని 8లక్షలకు భార్య పథకం భర్త ఇచ్చిన మిస్సింగ్ కేసుతో వెలుగులోకి వొచ్చిన వైనం ఇది. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామానికి చెందిన  తల్లం కృష్ణ కు పదిహేనేళ్ల క్రితం తన అక్క కూతురు అయిన శిరీష తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. గుంటూరు జిల్లా కి చెందిన అరటీకాయల వ్యాపారి సిద్ధి సాయికుమార్ తో కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. దీనితో తన భర్తను ఎలాగైనా అడ్డుతొలిగించుకోవాలి అని సిద్ధి సాయికుమార్  మరియు మరో ఎనిమిది మందితో  8లక్షలకు సుపారి ప్లాన్ ఒప్పందం కుదుర్చుకుని కొంత మొత్తం అడ్వాన్స్ గా సిద్ధి సాయి కుమార్ కి ఇచ్చింది.ఈక్రమంలో శిరీష తనభర్త కు అన్నంలో విషం కలిపింది అప్రయత్నం విఫలమైందని మరొకసారి ఈ ముఠా సభ్యులు కృష్ణ కి విషపు ఇంజక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించగా తృటిలో తపించుకున్నాడు. దీనితో శిరీష గత నెల18వ తేదీన ఇంటినుంచి పారిపోయింది. కృష్ణ తనభార్య శిరీష కనిపించడం లేదంటూ పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా శిరీష గుంటూరులో ఉన్నట్లు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా శిరీష చేసిన కుట్రలు బయటపడ్డాయి. దీనితో శిరీష, సిద్ధి సాయికుమార్ ,మరో ఎనిమిది మంది పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు

Related Posts