YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫారెస్ట్ కాలేజీ

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫారెస్ట్ కాలేజీ

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫారెస్ట్ కాలేజీ
సిద్దిపేట డిసెంబర్ 11 
ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు.తమిళనాడులోని గట్టుపాలయం ఫారెస్ట్ కాలేజీ దేశంలోనే అత్యధిక సంఖ్యలో 120 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారులను అందించింది. అంతకంటే ఎక్కువమంది ఐఎఫ్‌ఎస్‌లను తెలంగాణ నుంచి తయారుచేసేందుకు వీలుగా దేశం గర్వించే రీతిలో ఫారెస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావించిన సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ములుగులో ఫారెస్ట్ కాలేజీ రూపుదిద్దుకున్నది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫారెస్ట్ కాలేజీని పూర్తిస్థాయి లేదా డీమ్డ్ యూనివర్సిటీగా హోదా పెంచడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో తాత్కాలికంగా కొనసాగుతున్న బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులు నూతన క్యాంపస్‌లోకి మారనున్నాయి. 2020 నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీతోపాటు ఏకకాలంలో ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సులను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ కాలేజీ పరిపాలనా భవనాన్ని దాదాపు 12 ఎకరాల పరిధిలో, రెండు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరుచేసింది.గజ్వేల్ నియోజవకవర్గం నర్సంపల్లి రిజర్వ్‌ఫారెస్ట్ బ్లాక్‌లో సువిశాల ప్రాంతంలో పరిపాలనా విభాగం, తరగతి గదులు, సెమినార్ హాల్స్, ల్యాబ్‌లు, హాస్టళ్లు, క్యాంటీన్‌లు, ఆడిటోరియం, రైతు హాస్టళ్లు, గెస్ట్‌హౌస్‌లు, పరిశోధనా విభాగాలను ఏర్పాటుచేశారు. అటవీవనరులు, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం, వాటి వాడకం, అటవీ సాంఘిక శాస్త్రం, సామాజికశాస్త్రంతోపాటు వన్యప్రాణి శాస్త్రం, పట్టణాల్లో అడవుల పెంపకం, సుందరీకరణ, సిల్వికల్చర్ విధానాలపై వివిధ విభాగాలుంటాయి.

Related Posts