YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

 తెలంగాణలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్  : కేసీఆర్

 తెలంగాణలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్  : కేసీఆర్

 తెలంగాణలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్  : కేసీఆర్
మెదక్, డిసెంబర్ 11, 
కంటి వెలుగు పథకం మాదిరిగా రాష్ట్ర ఆరోగ్య సూచీ తయారు చేయాలనేది తన కోరిక అని సీఎం కేసీఆర్ చెప్పారు. హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రజలందరికీ ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం తన సొంత నియోజకపర్గం గజ్వేల్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గజ్వేల్‌‌లో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి కుటుంబ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సేవలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ రిలాక్స్ కాకూడదని వ్యాఖ్యానించారు.గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో 7,500 ఎకరాల అటవీ భూమిని వనమూలికల పార్క్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. జనవరి చివరి నాటికి కాళేశ్వరం నీళ్లను గజ్వేల్‌కు తీసుకొస్తామని తెలిపారు. భవిష్యత్తులో గజ్వేల్ నుంచే హైదరాబాద్‌కు చేపల ఎగుమతి చేపడుతామన్నారు. నియోజకవర్గంలో పార్టీలు, పైరవీలు అనేది లేకుండా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని వెల్లడించారు. హరితహారంలో గజ్వేల్ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.గజ్వేల్‌లో ఆరున్నర ఎకరాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత మార్కెట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 16 వాణిజ్య దుకాణాలు, సూపర్‌ మార్కెట్‌‌తో పాటు చిన్నారుల కోసం ప్రత్యేకంగా పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 6 బ్లాక్‌లు ఉన్నాయి. ఈ మార్కెట్‌లో అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మాంసాహారం విక్రయించనున్నారు.అనంతరం గజ్వేల్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్‌కు చెందిన ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు. వారందరితో కలిసి ఆయన అక్కడే భోజనం చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు హరీశ్ రావు, నిరంజన్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఈటల రాజేందర్‌తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.అంతకుముందు ములుగులో నూతనంగా నిర్మించిన ఫారెస్టు కాలేజీ, పరిశోధనా కేంద్రాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం అటవీ శాఖ అధికారులు, విద్యార్థులతో మాట్లాడారు. ఏటా వందలాది మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా దాదాపు రూ.175 కోట్ల వ్యయంతో ఈ కాలేజీ భవనాలను నిర్మించారు. అధునాతన సౌకర్యాలు కల్పించారు.తమిళనాడులోని గట్టుపాలయం ఫారెస్ట్ కాలేజీ దేశంలోనే అధిక సంఖ్యలో 120 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారులను అందించింది. అంతకంటే ఎక్కువ మంది ఐఎఫ్‌ఎస్‌లను తెలంగాణ నుంచి తయారు చేసేందుకు వీలుగా ములుగులో ఫారెస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారు. సీఎం ఆలోచనకు అనుగుణంగా ఈ ఫారెస్ట్ కాలేజీ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ కాలేజీని పూర్తి స్థాయి లేదా డీమ్డ్ యూనివర్సిటీగా హోదా పెంచడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.అనంతరం సీఎం కేసీఆర్.. ములుగులో నిర్మించిన హార్టికల్చర్ యూనివర్సిటీ భవనాలను ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడంతో పాటు ఉద్యాన పంటలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ములుగు మండల కేంద్రంలో ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 16 ఎకరాల విస్తీర్ణంలో రూ. 185 కోట్ల వ్యయంతో ఈ విశ్వవిద్యాలయ భవనాలను నిల్మించారు.గజ్వేలుకు కాళేశ్వరం నీరుగజ్వేల్‌ నియోజకవర్గానికి వచ్చే ఏడాది జనవరి నెలఖారు నాటికి కాళేశ్వరం నీళ్లు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ ఆడిటోరియంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. మల్లన్నసాగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. పతీ చెరువు, కుంట నిండి పంటలు పండినప్పుడే నిజమైన సంతోషం వస్తుందని సీఎం తెలిపారు. దేశమే ఆశ్చర్యపోయే విధంగా గజ్వేల్‌లో అడవులను పునరుద్ధరిస్తున్నాం. గజ్వేల్‌ను పచ్చగా చేయాలనుకున్నాం. చేసి చూపించాం.నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం. ఎన్నికలప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటేసినా.. ఇప్పుడు అందరూ మనవాళ్లే. గజ్వేల్‌ నియోజకవర్గంలో 30 వేల ఎకరాల్లో అడవి విస్తరించింది. నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉంది. ఆదర్శం ఉంటే అధికారులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని సీఎం స్పష్టం చేశారు. గజ్వేల్‌లో ప్రతీ మనిషికి చేతినిండా పని ఉండాలి. ప్రతీ ఇల్లు పాడి పరిశ్రమలో కళకళలాడాలి. నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం. దేశాన్ని, రాష్ర్టాన్ని ఆర్థికమాంద్యం పట్టిపీడిస్తోంది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ విశ్రమించకూడదు. ఏ గ్రామంలో ఏముంది.. ఏం కావాలి అనే విషయంపై అవగాహన రావాలి. ఏ ఊరి సర్పంచ్‌ ఆ ఊరికి కథానాయకుడు కావాలి. ప్రజల మధ్య ఉండే ఏ రాజకీయ నాయకుడూ రిలాక్స్‌ కావొద్దు. ఇతరులు గజ్వేల్‌ను చూసి నేర్చుకోవాలి. ఏ గ్రామంలో ఏ పని లేకుండా ఉన్నవాళ్లెవరు.. వాళ్లకేం పనివ్వాలో ఆలోచించాలి అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.తెలంగాణ సాహితీ సౌరభం ఈ మహతి ఆడిటోరియం. మహతి ఆడిటోరియం నుంచి నలు దిశలా వెలుగులు ప్రసారించాలని తన కోరిక. ఈ హాల్‌కు మహతి అనే పేరు తానే పెట్టాను అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సంగీతంలో ఆరితేరిన వారు నారదుడు, తుంబురుడు. నారద మహర్షి వాయించే వీణ పేరు మహతి. జిల్లా కేంద్రాల్లో ఇలాంటి హాళ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని సీఎం స్పష్టం చేశారు

Related Posts