చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
అమరావతి డిసెంబర్ 12, (న్యూస్ పల్స్)
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రతిపక్షనేత చంద్రబాబు ఉన్మాదనడాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. సీఎం ని పట్టుకుని ఉన్మాది అంటారా ...? సీఎం ని ఉన్మాది అనడం సబబేనా. చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే నని డిమాండ్ చేసారు. చంద్రబాబు సింగపూర్ ని కూడా చెడకొట్టారు. ఎన్టీఆర్ పేరు లేకుండా చంద్రబాబు ఎప్పుడైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు. ఏదో రకంగా తాను చెప్పాలి అనుకునే దాన్ని....చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ప్రసంగిస్తూ అడుగడుగునా టీడీపీ సభను అడ్డుకుంటుంది. సభలో వ్యక్తిగత దూషణలు సరికాదని అన్నారు. సభా వ్యవహారాలపై ఎథిక్స్ కమిటీకి రిఫర్ చెయ్యాలి. సీఎం పై అమర్యాదగా మాట్లాడటం సరికైనది కాదని అన్నారు.