YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ నిరసన

ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ నిరసన

ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ నిరసన
నెల్లూరు, డిసెంబర్ 12,:
ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. మాజీ మేయర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ అబ్ధుల్ అజీజ్  ఆద్వర్యంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధా, నగర అధ్యక్ష్యుడు  కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మేల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి తదితరులు ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదుట ధర్నానిర్వహించారు. తక్షణం పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క పైసా కూడా ఛార్జీలను పెంచనని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6నెలలకే ప్రజలపై ఛార్జీల మోత వేశారని మండిపడ్డారు. ఇదే ధోరణితో ఉంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

Related Posts