YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

కట్నం తక్కువ ఇవ్వడంతో మరో పెళ్లి పాట్నా

కట్నం తక్కువ ఇవ్వడంతో మరో పెళ్లి పాట్నా

కట్నం తక్కువ ఇవ్వడంతో మరో పెళ్లి
పాట్నా, డిసెంబర్ 12,
ట్నం కోసం రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. మొదటి భార్యను అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌లోని కతిహార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ముఖేశ్ షా అనే వ్యక్తికి 2012లో ఓ యువతితో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. పెళ్లి సమయంలో ముఖశ్ కుటుంబం రూ.5లక్షలు డిమాండ్ చేయగా.. వధువు తరఫువారు రూ.3లక్షలు మాత్రమే కట్నంగా ఇచ్చారు.దీంతో పెళ్లయినప్పటి నుంచి ముఖేశ్ అదనపు కట్నం కోసం భార్యను వేధించేశాడు. ఇటీవల అతడు సరిగ్గా ఇంటికి రాకపోవడంతో పాటు ప్రవర్తనలోనూ తేడా కనిపించడంతో భార్య నిఘా పెట్టగా షాకింగ్ విషయం తెలిసింది. కొంతకాలం క్రితమే రెండో పెళ్లి చేసుకున్న అతడు మరోచోట కాపురం పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశావంటూ ఆమె భర్తను నిలదీసింది. అయితే దీనికి అతడు చెప్పిన కారణంతో మరోసారి షాకైంది.పెళ్లి సమయంలో తనకు రూ.2లక్షలు తక్కువగా కట్నం ఇచ్చారని, ఆ డబ్బు కోసమే మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. దీంతో బాధితురాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై మోసం, వరకట్న వేధింపుల కింద కేసు పెట్టింది. అదనపు కట్నం తెస్తేనే ఇంట్లో అడుగుపెట్టాలని అత్తమామలు సైతం వేధిస్తున్నారని పోలీసులకు చెప్పింది.

Related Posts