YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 టీడీపీ లాబీలో కూర్చొని వైసీపీ నేతలకు స్లిప్పులిస్తూ

 టీడీపీ లాబీలో కూర్చొని వైసీపీ నేతలకు స్లిప్పులిస్తూ

 టీడీపీ లాబీలో కూర్చొని వైసీపీ నేతలకు స్లిప్పులిస్తూ
విజయవాడ, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్)
ఏపీ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర సీన్ కనిపించింది. నాలుగో రోజు సభకు వచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ ఎమ్మెల్యేల కూర్చునే మొదటి వరుసలో.. కొండపి ఎమ్మెల్యే బాల వీరాజనేయ స్వామి పక్క సీట్లో వంశీ కూర్చున్నారు. మీడియాపై ఆంక్షలు, 2430 జీవోపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో వల్లభనేని వంశీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ కనిపించారు.వైఎస్సార్‌సీపీ-టీడీపీ మధ్యలో మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో.. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వంశీ కొన్ని స్లిప్స్ రాసి పంపించారట. ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వల్లభనేని ఈ స్లిప్స్ పంపారు. వంశీ ఎమ్మెల్యేలకు పంపిన స్లిప్పులో ఏం రాసి ఉందన్నది ఆసక్తికరంగా మారింది. అందులో టీడీపీని ఇరుకున పెట్టే అంశాలనే అందులో ప్రస్తావించి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది.రెండు రోజుల క్రితంవల్లభనేని తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని కోరిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేశారని.. తాను గన్నవరం నియోజకవర్గ ప్రజల సమస్యల్ని వినిపించేందుకు సభలో కొనసాగాలనుకుంటున్నానని.. తనకు వేరేగా సీట కేటాయించాలని కోరారు. దీనిపై పరిశీలన చేసిన స్పీకర్.. ఎక్కడైనా కూర్చోవచ్చని చెప్పారు. అయితే వంశీ సభలో గురువారం వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారింది.

Related Posts